సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ శాకుంతలం. మార్చి నెలలో మొదలు కానున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ముగియనుంది. సమ్మర్ వరకు చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. సోమవారం చిత్ర లాంచింగ్ కార్యక్రమం నిర్వహించగా, సినిమాకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు మేకర్స్.
డీఆర్పీ-గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై దిల్రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలో ముఖ్య పాత్రలకు స్టార్ నటీనటులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. దుర్వాస మునిగా మోహన్ బాబు కనిపిస్తాడని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఆ పాత్రకు ఆయనైతేన సరిగ్గా సరిపోతారని భావించిన గుణశేఖర్.. మోహన్ బాబుని సంప్రదించడం, ఆయన వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయి. తెలుగు, హిందీ, తమిళ భాషలలో నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.