వరస సినిమాలు చేస్తున్నపుడు కన్ఫ్యూజన్స్ కూడా అలాగే వస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఈయన ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఏది ఎప్పుడు మొదలవుతుందనే కన్ఫ్యూజన్స్ కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రం తర్వాతే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది.
ఎందుకంటే ఏడాదిన్నరగా చిరు కోసం కథ పట్టుకుని వేచి చూస్తున్నాడు మెహర్ రమేష్. వేదాలం సినిమాను ఈయన రీమేక్ చేస్తున్నాడు. ఈ కథ కూడా ఫైనల్ అయిపోయి.. సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. పైగా ప్రీ ప్రొడక్షన్ కూడా 2020లోనే మొదలు పెట్టాడు మెహర్ రమేష్. అయితే చిరు మాత్రం ఈ చిత్రం కంటే ముందు లూసీఫర్ రీమేక్ చేయాలని చూస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్లోనే సెట్స్ పైకి రావాల్సి ఉన్నా కూడా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమే. ఈ సినిమా స్క్రిప్టులో దర్శకుడు రాజా చాలాసార్లు మార్పులు చేశాడు. ఈ సినిమా కోసం కొన్ని నెలలుగా బిజీగానే ఉన్నాడు.
అయితే దీనిపై ఇప్పుడు చిరు వర్గం కూడా క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదని.. మోహన్ రాజానే లూసీఫర్ రీమేక్ తెరకెక్కించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. మరోవైపు లూసిఫర్, వేదాళం రీమేక్ల తర్వాత బాబీ కూడా లైన్ లోనే ఉన్నాడు. అదెప్పుడు మొదలవుతుందో తెలియదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్ డౌన్ ఎఫెక్ట్ : మళ్లీ ఆగిన సీరియల్ షూటింగ్స్
జాతిరత్నం హీరోయిన్ గ్లామర్ పిక్స్.. వైరల్
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్కు బైబై చెప్పాలంటూ సూచన!
కుర్ర దర్శకుల కలలను చిదిమేస్తున్న కరోనా
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
పాత ఫార్ములాని ఫాలో అవుతున్న త్రివిక్రమ్..!
రాధే చిత్రాన్ని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ
అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!
నాగార్జునతో పదోసారి జోడీ కడుతున్న అనుష్క
సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ
‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద కథే ఉంది..!
తమిళియన్ను పెండ్లి చేసుకుంటా: రష్మిక