చెన్నై, జూలై 27: తమిళనాడులోని చెన్నైలో గురువారం నుంచి ప్రారంభం కానున్న 44వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్ పోటీలపై బీజేపీ నేతలు వివాదం రేపారు. ఈ పోటీలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నగరంలో ఏర్పాటు చేసిన ప్రచార హోర్డింగ్లు, పోస్టర్లపై మోదీ ఫొటోలను అతికించారు.
కేంద్ర ప్రభుత్వం వల్లే చెస్ ఒలింపియాడ్ పోటీలను నిర్వహించే అవకాశం తమిళనాడుకు వచ్చిందని పేర్కొంటూ మోదీ పోస్టర్ను అతికిస్తున్న వీడియోను అమర్ ప్రసాద్ అనే బీజేపీ నేత ఒకరు ట్విట్టర్లో పోస్టు చేశారు.