ఖలీల్వాడి, జూన్ 3: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్లో మంత్రి మీడియా తో మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల తరువాతైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుర్తుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తొలిసారి ఢిల్లీలో వేడుకలు నిర్వహించగా, తెలంగాణ మంచి కోసం ఏదైనా ప్రకటన చేస్తా రని ఆశించామన్నారు. కానీ అవే రాజకీయా లు, అవే అబద్ధపు ప్రచారాలని, ఇక్కడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్టే అమిత్షా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ అంటే బీజేపీ నాయకులకు మొదటి నుంచి నరనరాన ద్వేషమే ఉన్నదని పునరుద్ఘాటించారు.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధు డు అల్లూరి సీతారామరాజును తెలంగాణ ఉద్యమకారుడిగా చిత్రీకరించిన బీజేపీ నేతలు నవ్వుల పాలయ్యారన్నారు. అమిత్షా చెప్పిన అబద్ధాలకు రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పక్కన కూర్చోని బసవన్నలా తల ఊపారని మండిపడ్డారు.