హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతున్నది. ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపైనే కేంద్రం 2014-15 నుంచి 2021-22 మధ్య రాష్ర్టాలకు రావాల్సిన ఆదాయంలో 186 శాతాన్ని కాజేసింది. రాష్ర్టాల ఆదాయాన్ని సెస్ల రూపంలో కాజేయడమే కాకుండా పన్నుల రూపేణా రావాల్సిన ఆదాయానికీ గండి కొట్టింది. ఫలితంగా 2021-22లో రావాల్సిన రూ.1.15 లక్షల కోట్లకు పైగా రాష్ర్టాలు నష్టపోవాల్సి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 271 ప్రకారం కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, సెస్లు మినహా అన్ని పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. అయితే రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నులకు మోదీ సర్కా రు ఎసరు పెట్టింది. రాష్ర్టాలకు ఆదాయం దక్కకుండా సెస్ల రూపంలో కాజేయడమే పనిగా పెట్టుకొన్నది. పెట్రోలియం శాఖ సమాచారం ప్రకారం ఈ రంగం నుంచి కేంద్రానికి 2014-15లో రూ.1.72 లక్షల కోట్ల ఆదాయం ఉండ గా, 2021-22 నాటికి ఏకంగా రూ.4.92 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రాల నుంచి రూ.1.62 లక్షల కోట్లున్న ఆదాయం రూ.2.82 లక్షల కోట్లకు చేరుకొన్నది.
ఇందులో 75 శాతం ఆదాయం రాష్ర్టాలకు రావాల్సిందే. రాష్ర్టాల నుంచి కేంద్రానికి రూ.10 వేల కోట్లే వెళ్లాల్సి ఉండగా, అది రూ.2.1 లక్షల కోట్లకు పెరిగింది. రాష్ట్రాలు వ్యాట్ (పెట్రోల్పై 35.2%, డీజిల్పై 27 %)లో మార్పు చేయలేదు. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రాల ఆదాయాన్ని కొల్లగొట్టడానికి సెస్లను అడ్డం పెట్టుకొన్నది. పెట్రోల్పై ఉన్న సెస్ను 9.48% నుంచి 27.9శాతానికి, డీజిల్పై 3.56% నుంచి 21.8 శాతాన్ని పెంచుకొన్నది. కేంద్రం కుటిల నీతితో ఒక్క తెలంగాణే 2021-22లో రూ.5 వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. రాష్ట్రానికి 41 శాతం వాటా రావాల్సి ఉండగా, 29-32 శాతంతోనే సరిపెట్టుకోవాల్సిన వస్తున్నదని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.