ఇప్పటికే గుజరాత్లో ప్రైవేట్ పోలీసులు
ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రైవేట్ వాళ్లే
చాలా రంగాలు పెట్టుబడిదారుల చేతుల్లో
బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ విమర్శ
న్యూఢిల్లీ, జూన్ 26: మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్’తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసిన కేంద్రం.. ఇప్పుడు ఆర్మీని కూడా ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ను వ్యతిరేకించటానికి కారణాలను, డిమాండ్లను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..