హుజూరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుమ్మరులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిర్సెడు గ్రామంలో ఇల్లంతకుంట రమేశ్ ఆధ్వర్యంలో కుమ్మరి కులస్తులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కుమ్మరి కులస్తులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆధునిక యంత్రాలను అందిస్తామని, రూ.50లక్షలతో హుజూరాబాద్ పట్టణంలో కుమ్మరి భవన్ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిరంతరంగా కొనసాగాలన్న, కుమ్మరులు ఆర్థికంగా ఎదగాలన్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నియోజకవర్గ కన్వీనర్, టీఆర్ఎస్ నాయకులు నాంపల్లి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ రఫీక్, వార్డు సభ్యుడు సురేశ్, ఇతర నాయకులు స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.