శంషాబాద్ రూరల్:బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ మోడల్స్కూల్ విద్యార్థులు ఎంపికయినట్టు పాలమాకుల మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుప్రియ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన ఎల్.కల్యాణి, హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన భరత్ ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపీకైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.