ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయం వద్ద లౌడ్స్పీకర్లో హనుమాన్ చాలీసా హోరెత్తింది. దీనిని ప్లే చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత, ట్యాక్సీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసీదుల్లో అజాన్ను అనుమతించడంపై నిరసనగా శ్రీరామ నవమి సందర్భంగా ముంబైలోని శివసేన భవన్ వద్ద హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ నాయకుడు యశ్వంత్ కిల్లెదార్ ఒక ట్యాక్సీపై మైకు ఏర్పాటు చేసి శివసేన ప్రధాన కార్యాలయం సమీపంలో హనుమాన్ చాలీసా ప్లే చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు యశ్వంత్తోపాటు ట్యాక్సీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
కాగా, కర్ణాటకలో మొదలైన అజాన్ వివాదం మహారాష్ట్రకు పాకింది. మసీదుల్లో ఏర్పాటు చేసిన మైక్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మసీదుల వద్ద మైకుల్లో హనుమాస్ చాలీసా ప్లే చేస్తామని హెచ్చరించారు. అలాగే ముంబైలోని మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాలని ప్రధాని మోదీని ఆయన కోరారు. పాకిస్థాన్ మద్దతుదారులు వీటిల్లో తలదాచుకుంటున్నారని, ఆధార్ కార్డులు కూడా లేని వీరిని కొందరు ఎమ్మెల్యేలు తమ ఓటు బ్యాంకు కోసం వినియోగించుకున్నారని ఆరోపించారు.
#WATCH | Maharashtra: Mumbai Police later stopped the Hanuman Chalisa on a loudspeaker that was being played by MNS outside Shiv Sena HQ in Mumbai. MNS leader Yashwant Killedar detained and taken to Shivaji Park police station. pic.twitter.com/Susq4AdWqY
— ANI (@ANI) April 10, 2022