దుండిగల్: బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధిస్తానన్న మాట నిలబెట్టుకున్నానని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక గేమ్స్లో ప్రత్యర్థులను తన పంచ్పవర్ మట్టికరిపించిన ఈ ఇందూరు బాక్సర్ పసిడి పతకాన్ని ముద్దాడింది. ఇచ్చిన మాట ప్రకారం పతకంతో తిరిగివచ్చిన తమ విద్యార్థికి మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ) బుధవారం ఘన స్వాగతం పలికింది.
వందల మంది విద్యార్థులు జయహో నిఖత్ అంటూ జయజయధ్వానాలు చేస్తూ బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిఖత్ మాట్లాడుతూ ‘ఎమ్ఎల్ఆర్ఐటీ ఇస్తున్న ప్రోత్సాహానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు, అన్ని రంగాల్లో అబ్బాయిలకు దీటుగా రాణిస్తున్నాం. కామన్వెల్త్లో పతకం గెలిచిన తర్వాత కాలేజీకి వస్తానన్న మాటను నిలబెట్టుకున్నాను’ అని అంది. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ఆర్ఐటీ చైర్మన్ లక్ష్మణ్రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.