ఆత్మీయులకు అభినందన సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
హైదరాబాద్ మార్చు 25 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు సహకరించిన ఆత్మీయులందరికీ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించినవారితో గురువారం హైదరాబాద్ నాగోల్లో ఆత్మీయుల అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ విద్యాసంస్థల ప్రముఖులు, యజమానులు, విద్యావంతులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా పల్లా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన ఆత్మీయులందరికీ ఎల్లవేళల అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపిన స్ఫూర్తిని కొనసాగిస్తూ టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అండగా నిలవాలని పల్లా విజ్ఞప్తిచేశారు.
పల్లాను కలిసిన గెస్ట్ లెక్చరర్లు
ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డిని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పల్లాను కలిసినవారిలో బాబురావు కే మహేశ్కుమార్, ఎస్ వెంకటేశ్, ఎల్ శ్రీకాంత్, ఇసాక్, బీ కృష్ణ, ఈ సైదులు, భానుప్రకాశ్, హెచ్ శ్రీకాంత్, సత్యనారాయణ, స్వామి, కే అంజయ్య, ఎన్ కిరణ్కుమార్, ఎం భిక్షపతి, ఏ రమేశ్, ఎం రఘు తదితరులు పాల్గొన్నారు.