హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా కల్వకుంట్ల కవిత గురువారం మండలి సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కవితను సభకు పరిచయం చేశారు. కవితకు చైర్మన్తోపాటు సభ్యులు అభినందనలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే.