నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణం గంగస్థాన్లో తెలంగాణ జాగృతి నాయకుడు రమేష్ రావు కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కాగా, రమేష్ రావు ఇటీవలే గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమంలో రమేష్ రావు సేవలను గుర్తు చేసుకున్నారు. ఎవరు కూడా అధైర్య పడొద్దని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కవిత భరోసానిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.