హైదరాబాద్ : భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్కు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. యువరాజ్కు చెందిన యూవీకెన్ ఫౌండేషన్ రూ.2.5కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ను నిజామాబాద్ జనరల్ ఆసుప్రతిలో ఏర్పాటు చేసింది. దవాఖానలో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ చూపారు. ఫౌండేషన్తో అనేకసార్లు చర్చలు జరిపిన కవిత.. క్రిటికల్ కేర్ బెడ్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత నెలలోనేనూ ఫౌండేషన్ సీఈఓ రిషబ్ బిష్ణోయ్తోనూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ మేరకు ఫౌండేషన్ ఇటీవల ఆసుపత్రిలో బెడ్స్ను చేసింది. సంస్థ ప్రతినిధులు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి సాయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూవీ, ఫౌండేషన్ ప్రతినిధులకు జిల్లా ప్రజల పక్షాన ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు.