హైదరాబాద్ : ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.. ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాచారంలో దళిత బంధు లబ్దిదారుడు వేముల మారయ్యకు చెందిన ఏబీ డిజిటల్స్, ఫ్లెక్స్ గ్రాఫిక్స్ సెంటర్ను కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర వెంటన నడిచిన వ్యక్తి మారన్న అని ప్రశంసించారు. మారయ్య షాపును ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
పార్లమెంట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆమె స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దళిత బంధు పథకం ద్వారా 563 మంది లబ్ది పొందారని గుర్తు చేశారు. త్వరలోనే గిరిజన బంధు కూడా అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు శాంతి సైజన్ శేఖర్, బొంతు శ్రీదేవి, మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, రూప్ సింగ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Inaugurated AB Digitals & Flex printing at Nacharam. Grateful to CM KCR Garu for giving the dreams of Maarayya, a chance to be fulfilled under Dalita Bandhu Scheme. pic.twitter.com/4ccc3q9EvW
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 28, 2022