కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 3 : కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మునుపెన్నడూ లేనంత వైభవంగా జరిగిన పూలజాతరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ఆమె వెంట ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ పాల్గొన్నారు. ముందుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో బతుకమ్మను పేర్చిన ఎమ్మెల్సీ కవిత.. శేషాద్రినగర్, హనుమాన్ దేవాలయంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆటను ఆడారు.
అనంతరం బతుకమ్మను నెత్తిన పెట్టుకుని రెండు కి.మీలు నడుచుకుంటూ కూకట్పల్లి రంగధాముని చెరువుగట్టుకు చేరుకుంది. చెరువుగట్టుపై మహిళలతో కలిసి కోలాటం.. దాండియా.. బతుకమ్మ ఆటలాడి సందడి చేశారు. కొలనులో బతుకమ్మను నిమజ్జనం చేసి గంగమ్మకు పూజలు చేసి సద్దుల ప్రసాదాన్ని పూజించారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందని కొనియాడారు.
కూకట్పల్లిలో కుర్మయ్యగారి కొండల్రావు నివాసంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ బతుకమ్మ వద్ద ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ నవీన్కుమార్ దంపతులు, కుర్మయ్యగారి కొండల్రావు దంపతులు