హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నారనగా నే బతుకమ్మ ఇండియా గేట్ వద్ద వెలుగుతున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ ఎనిమిదేండ్లకు బీజేపీకి బుద్ధి వచ్చిందన్నారు. మంగళవారం తెలంగాణభవన్లో టీఆర్ఎస్ మహి ళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్తోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, భాష, యాసకు గౌరవం దక్కిందని, తెలంగాణ తల్లిని సగౌరవంగా నిలబెట్టుకొన్నామన్నారు.
విభజన కావాలా?
రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లకు కేంద్రంలోని బీజేపీకి విమోచన గుర్తుకొచ్చిందని కవి త మండిపడ్డారు. తెలంగాణలో విమోచన ది నం నిర్వహించిన బీజేపీ.. గుజరాత్లో పటేల్ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టిందన్నారు. విభజన కావాలో ఐక్యత కావా లో తేల్చుకొనే సమయం వచ్చిందన్నారు.
ఎట్టకేలకు ఢిల్లీలో వేడుకలు
ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వానికి బతుకమ్మ వేడుక గుర్తొచ్చింది. ప్రపంచంలోని అనేకచోట్ల బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నా కేంద్రం ఎన్నడూ పట్టించుకోలేదు. ఏటా ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు చేస్తున్నా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తొలిసారిగా తెలంగాణ పండుగను కేంద్రం అధికారికంగా నిర్వహించడం గమనార్హం.