జగిత్యాల,సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లాలోని నృసింహక్షేత్రమైన ధర్మపురిలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొప్పుల ఎల్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో ఐదురోజులు గా కోలాట వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం కోలాటాల ముగింపు కార్యక్రమంతోపాటు, బతుకమ్మ వేడుకలు నిర్వహించా రు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, జా గృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరు కాగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
వేడుకల సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచే జూనియర్ కాలేజీ మైదానం మహిళలు, బతుకమ్మలతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం 6.30 గంటలకు ధర్మపురి చేరుకున్న కవితకు మంత్రి ఈశ్వర్, ఎల్ఎం ట్రస్టు చైర్పర్సన్ స్నేహలత కొప్పుల,జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్వాగతం పలికారు. అనంత రం ఎమ్మెల్సీ ధర్మపురి నర్సన్న క్షేత్రానికి వెళ్లి స్వా మివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నెత్తిన పెద్ద బతుకమ్మతో మ హిళలతో కలిసి కిలోమీటర్ దూరంలో ఉన్న సంబురాల వేదికైన జూనియర్ కాలేజీ మైదానం వరకు కాలినడకన ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ భారీ పటాకుల మోతల మధ్య ఘనస్వాగతం పలికారు. నాలుగురోజులపాటు నిర్వహించిన బతుకమ్మ, దసరా కోలాటాల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన బృందాలకు మంత్రి,ఎమ్మెల్సీ బహుమతులు అందజేశారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలతోకలిసి కవిత బతుకమ్మ ఆడారు.