హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్లో తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, విజయలక్ష్మి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని కవిత ట్వీట్ చేశారు.