చంఢీఘడ్: అకాలీదళ్కు చెందిన ఎమ్మెల్యేలు ఇవాళ ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఆ ఎమ్మెల్యేలు పంజాబ్ విధానసభకు ఎడ్ల బండ్లపై స్వారీ చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రాన్ని నిలదీసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే దిల్లాన్ తెలిపారు. ఈ అంశంపై ఢిల్లీకి వెళ్లి కూడా నిరసన ప్రదర్శన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే దీనికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలన్నారు. పెట్రోల్పై 27.5 రూపాయలు, డీజిల్పై 17.5 రూపాయల వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం వసూల్ చేస్తోందని, ఇది ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ అని ఆయన ఆరోపించారు. వ్యాట్ను తగ్గించకపోవడం వల్ల పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు వ్యాట్ ధర కూడా అధికమవుతోందని అన్నారు.