తిరుపతి : టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కల్వకుంట్ల విద్యాసాగర్ చేత టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
భగవంతునికి సేవ చేసే భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి కీర్తిని నలుమూల వ్యాప్తి చేయడంలోనూ, సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించడంలో తన వంతు కృషి చేస్తానని విద్యాసాగర్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crime News | నల్లగొండ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టివేత
Farmer Died : ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
Rain Alert | తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వానలు..