జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. గత నెల 25న ఆయన ప్రైవేట్ వైద్యుల కోటాలో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఇవాళ ఉదయం జిల్లా ప్రధాన దవాఖానలో బూస్టర్ డోస్ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా టీకాపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమయ్యింది. మొదటి విడుతలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇచ్చారు. అదే నెల 25న ప్రైవేటు దవాఖానల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ప్రైవేట్ డాక్టర్ అయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాలలో టీకా తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ టీకా వేయించుకున్న తొలి ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ నిలిచారు.