కేసముద్రం, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని తాళ్లపూసపల్లి, రంగాపురం, పెనుగొండ గ్రామాల ఆడబిడ్డలకు చీరలను, పలువురు లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్ష న్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరా ఉంటున్నదన్నారు. తల్లిదండ్రులకు ఆర్థిక బారం తగ్గిందని తెలిపారు. కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే సీఎం కేసీఆర్ చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. తాళ్లపూసపల్లి గ్రామానికి సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదలను ఆ గం చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, సర్పంచ్లు రావుల విజిత, మాచర్ల నిర్మల, శశికళ, వైస్ ఎంపీపీ రావుల నవీన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు యాకూబ్రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ నజీర్అహ్మద్, కముటం శ్రీనివాస్, రావుల రవిచందర్రెడ్డి, మాచ ర్ల రమేశ్, ఎంపీటీసీలు సట్ల వెంకన్న, దుబ్బాకుల వెంకన్న, పార్వతి, నాయకులు సోమన్న, నీలం యాక య్య, హరిరాంనాయక్, తహసీల్దార్ ఫరీద్, ఎంపీడీవో రోజారాణి పాల్గొన్నారు.