వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 5 : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా గుర్తింపు కలిగిన వరంగల్ను త్వరలోనే అందంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం వరంగల్ చౌరస్తా నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలన్నా రు. అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనుల్లో ఆలస్యం కావడం వల్లే రోడ్డు అభివృద్ధి పనులు నెమ్మతించాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో త్వరలోనే నగరంలోని సుమారు 15 రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందుకే మూ డు విడుతలుగా ప్రత్యేక నిధులు మంజూ రు చేశారన్నారు. సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. నగరంలో వర ద కాల్వ నిర్మాణం సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కల్పన, టీఆర్ఎస్ నాయకుడు కొలిపాక శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్ : గౌడ కులస్తులకు అం డగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం ఉర్సు తా ళ్ల మండువాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. గీత పారిశ్రామిక సహకార సంఘం గ్రూప్లో-1లో గౌడ కులస్తుల సభ్యత్వ నమోదు కార్యక్ర మం ప్రారంభించామన్నారు. రూ.45 ల క్షలతో గౌడ కులస్తుల కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కా ర్పొరేటర్ మరుపల్ల రవి, గీత పారిశ్రామి క సహకార సంఘం చైర్మన్ మండా వెం కన్న, డైరెక్టర్ నాగపురి సంజయ్బాబు, ఉర్సు గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని హరి ప్రసాద్, మండా శ్యాం, నాగపురి వెంకటేశ్వర్లు, నాగపురి బలరాం, నాగపురి బొందయ్య, కుడా అడ్వైజరీ మెంబర్ మోడెం ప్రవీణ్ పాల్గొన్నారు. అలాగే 32వ డివిజన్లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్పొరేటర్ పల్లం పద్మ, నాయకులు పల్లం రవి, బొల్లం రాజు, పరదేశి రాజేశ్, ఎనగందుల సుధాకర్, బత్తిని రంజిత్ పాల్గొన్నారు.
ఉర్సులోని నాగేశ్వర స్వామి దేవస్థానం నుంచి అయ్యప్ప శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే నన్నపునేని శోభాయాత్రను ప్రారంభించారు. నాగమయ్య గుడి నుంచి రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్, సాకరాశికుంట, ఫోర్టురోడ్డు మీదుగా నాగమయ్య గుడికి శోభాయాత్ర చేరుకుంది. అయ్యప్ప భజనలు, స్వాముల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో శోభాయాత్ర సాగింది. మేయర్ గుండు సుధారాణి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు శోభాయాత్రకు హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పోశాల పద్మ, సిద్ధం రాజు, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, పూదరి అజయ్, నాగపురి అశోక్, కార్తీక్గౌడ్, బైరగోని మనోహర్, మిరియాల ఆదిత్య పాల్గొన్నారు.
మట్టెవాడ : వరంగల్ మండిబజార్లో జరిగిన గ్యార్మీ వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని హాజరయ్యారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు.