పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు టౌన్/ పటాన్చెరు, జూలై 25: ప్రజలకు పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అమ్మవారి దీవెనలు, ప్రజల సహకారంతో ఎనిమిదేండ్లుగా ఎమ్మెల్యేగా సమాజానికి సేవలందిస్తున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ముదిరాజ్బస్తీ పోచమ్మ దేవాలయం, జేపీ కాలనీ పోచమ్మ బస్తీలోని పోచమ్మ దేవాలయం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల కోరిక మేరకు పోతరాజులతో కొద్దిసేపు నృత్యాలు చేసి అందరిని అలరించారు.