ఎమ్మెల్యే కిశోర్కుమార్
అర్వపల్లి, జూన్ 27 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాల్వ వెంట ఉపాధిహామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో రాష్ర్టాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ కిరణ్కుమార్, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, తాసీల్దార్ యాదగిరిరెడ్డి, ఎంపీడీఓ విజయ, సహకార సంఘం చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.