ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
గోల్నాక, జూలై 13 : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
బహుదూర్పూరకు చెందిన అశ్రఫ్ఖాన్కు రూ.60వేలు, గోల్నాకకు చెందిన సాయిశ్రీనివాస్కు రూ.38వేలు, అంబర్పేట ఓవైసీనగర్కు చెందిన మహ్మద్ అఫ్రాన్కు రూ.15వేలు, చిలుకానగర్కు చెందిన సుబ్బయ్యకు రూ.38వేలు, కాచిగూడకు చెందిన నిఖత్ బేగంకు రూ.32వేలు, అంబర్పేట దుర్గానగర్కు చెందిన కె.శ్రీనివాస్కు రూ. 26వేలు, బాగ్అంబర్పేట బుర్జుగల్లీకి చెం దిన హాకిమ్సింగ్కు రూ.24వేలు, నల్లకుంటకు చెందిన వి.లావణ్యకు రూ.1 లక్ష, అంబర్పేట బాపునగర్కు చెందిన కళావతికి రూ.60వేలు, పటేల్నగర్కు చెందిన పోచయ్యకు రూ.60వేలు, కాచిగూడకు చెందిన రవీందర్యాదవ్కు రూ.31 వేల 500, కాచిగూడ నెహ్రూ నగర్కు చెందిన మక్బుల్పటేల్కు రూ.60వేలు, మల్లికార్జుననగర్కు చెందిన బాలాజీకి రూ.24వేలు, తిలక్నగర్కు చెందిన అశోక్కుమార్కు రూ.3లక్షలు, గోల్నాకకు చెందిన జి.సుధాకర్కు రూ.92వేలు, మొత్తం రూ.9 లక్షల 60వేల 500 విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.