హైదరాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్ కేడీ నెంబర్ వన్ అని, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బేడి నెంబర్ 1 అని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఏ జీవన్రెడ్డి విమర్శించారు. అరవింద్ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ అరవింద్కు దమ్ముంటే ఆర్మూర్లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అరవింద్ ఒక సైకో అని, డ్రగ్ ఆడిక్ట్ అని ఆయన ఆరోపించారు.
అరవింద్ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని, దేశంలో ఒకే ఇంట్లో మూడు పార్టీలు ఏకైక కుటుంబం అరవింద్దని ఆయన ఎద్దేవా చేశారు. అరవింద్ తాగిన మత్తులో మాట్లాడుతున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి పరిధిలో పనిచేస్తుందో తెలుసుకోవాలని ఆయన సూచించారు. నవంబర్ 4 నుంచి మళ్లీ దళిత బంధు హుజురాబాద్లో ప్రారంభమవుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత మీద మరో సారి మాట్లాడితే మహిళలు చీపుర్లు, చెప్పులతో కొడతారని హెచ్చరించారు. అరవింద్ స్టంట్ మాస్టర్ అని, రేవంత్ ఒక టెంటు మాస్టర్ అంటూ ధ్వజమెత్తారు.
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతో అరవింద్ గెలిచారని, దుబ్బాకలోనూ అదే రీతిలో రెండు పార్టీలు కుమ్మక్కు కావడంతోనే బీజేపీ గెలిచిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్కు డిపాజిట్ దక్కలేదన్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచిన మధుయాష్కికి ఎందుకు డిపాజిట్ రాలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్లోనూ ఈ రెండు పార్టీలు కుమ్మైక్కె అయ్యాయని, అయినా ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని అన్నారు. అక్కడ బీజేపీకి డిపాజిట్ రాలేదన్నారు. హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు.
ఫాల్తూ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, ఆయనతో తాము ఓటుకు నోటులో, ఆర్టీఐ దరఖాస్తులు, బ్లాక్ మెయిల్లో పోటీ పడలేమని విమర్శించారు. ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని, ఆయనతో సమానంగా అన్ని భాషల్లో మాట్లాడగలరా? అని రేవంత్ను ప్రశ్నించారు. ఏపీలోగా మాట్లాడినందుకు మీ ఇళ్లపై 30 సార్లు దాడులు చేయాల్సి వస్తుందని, అయితే తాము ఆలా చేయడంలేదన్నారు. దాడులకు తమ పార్టీ వ్యతిరేకమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నోరును మోరీలాగా మార్చిన ఘనత రేవంత్దని, అరగుండు అరవింద్కు తెలంగాణ ప్రజలు ఘోరీ కట్టాలని చూస్తున్నారన్నారు.