హుజూరాబాద్: కారు గుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే.. అడ్డా కూలీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హామీ ఇచ్చారు. హుజూరాబాద్ పట్టణంలోని అడ్డా కూలీలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ, తాను వలసకూలీ కడుపులో పుట్టిన బిడ్డనని, కూలీల సమస్యలు తెలుసునని చెప్పారు. అడ్డాకూలీలకు ప్రమాదబీమా, కూలి పెంపులాంటి సమస్యల పరిష్కారం కోసం తాను కృషిచేస్తానని తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తే ఎల్లవేళలా అండగా ఉంటాడని భరోసా కల్పించారు.