గుమ్మడిదల,నవంబర్ 23: ఆపదలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కానుకుంట గ్రామానికి చెందిన ఆకాంక్ష కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయడంతో ఆమెకు మంచి వైద్యం అందించడానికి ఎల్వోసీ ద్వారా రూ.50 వేలు మంజూరయ్యాయి. ఈ ఎల్వోసీ పత్రాన్ని ఆకాంక్ష కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. దీనికి బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు టీఆర్ఎస్ సీనియర్ నా యకులు నక్క వెంకటేశ్గౌడ్, గుండగళ్ల వెంకటేశ్ ఉన్నారు.
గుమ్మడిదల గ్రామానికి చెందిన ఆశన్నగారి రుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డి ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని పంపించారు. అదే గ్రామానికి చెందిన నల్లకిష్టగౌడ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే ఆ కుటుంబానికి తక్షణ సాయంగా మరో రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు జడ్పీటీసీ కుమార్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహ్మద్హుస్సేన్, సీనియర్ నాయకులు నరేందర్రెడ్డి, మద్దుల బాల్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ మొగులయ్య, గ్రామకమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, నాయకులు అంబరాములు, ఆయుబ్, కరుణాకర్గౌడ్, భాస్కర్, గోపి, శంకర్ ఉన్నారు.
పటాన్చెరు, నవంబర్ 23: దేవాలయాల అభివృద్ధికి పాటుపడుతానని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు జేపీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ సత్యభామ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గాలిగోపురం నిర్మాణం, శాంతినగర్ కాలనీలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు, దేవస్థానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చోట్ల పనులు చేస్తున్నామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా నూతనంగా దేవాలయాలను నిర్మించి ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
జిన్నారం, నవంబర్ 23 : అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న ఊట్ల సర్పంచ్ కొరివి ఆంజనేయులును ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ షాపూర్ నగర్లోని సాయి సిదార్ధ దవాఖానకు జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్తో కలిసి వచ్చిన ఎమ్మెల్యే దవాఖానలో చికిత్స తీసుకుంటున్న సర్పంచ్ ఆంజనేయులును కలిశారు. ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచ్ జింకల శివరాజ్ ఉన్నారు.
జిన్నారం, నవంబర్ 23 : ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి 18వ శబరియాత్ర సందర్భంగా ఈనెల 5న పటాన్చెరు జీఎంఆర్ ఫంక్షన్హాల్లో నిర్వహించే మహాపడిపూజ సందర్భంగా వర్ధమాన జానపద గాయకుడు వడ్ల నగేశ్చారి రూపొందించి ఆలపించిన మూ డు అయ్యప్ప పాటలను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆవిష్కరించారు. అయ్యప్ప గీతాలు మూడు కూడా చాలా బాగా వచ్చాయని నగేశ్చారిని ఎమ్మెల్యే అభినందించారు. పాట లు ప్రజాదరణ పొందుతాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ వి జయ్, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు హుస్సేన్, విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.