హైదరాబాద్ : ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆమోదించారు. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో సమర్పించారు. రాజీనామా లేఖను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం వెలువరించారు.ఈ క్రమంలో హుజూరాబాద్ సీటు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి సమాచారం ఇచ్చారు. అంతకుక్రితమే భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రి పదవినుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. బర్తరఫ్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు. మాసాయిపేట, దేవరయాంజల్, రావల్కోల్లో అసైన్డ్ భూములు, దేవాదాయ భూములను ఆక్రమించుకున్నట్లుగా ఈటలపై ఆరోపణలు. అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.