మంచిర్యాల : జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గాంధారి మైసమ్మ తల్లి ఆషాఢమాస బోనాల జాతరలో.. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించారు.
మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. రాష్ట్రంపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.