వరంగల్ రూరల్ : నాలుగో విడత పల్లె ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మొక్కలు నాటారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు పర్వతగిరి మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతిని విజయవంతం చేయాలన్నారు. పరిశుభ్రతను పాటించి ఆరోగ్య తెలంగాణకు అందరూ సహకరించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల
వనపర్తి జిల్లాలో నూతన కోర్టులు ప్రారంభం