రాంచీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జార్ఖండ్కు చెందిన మహిళా ఎమ్మెల్యే వెరైటీగా జరుపుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇవాళ రాంచీలోని అసెంబ్లీకి గుర్రంపై వచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ కల్నల్ రవి రాథోడ్ తనకు ఈ గుర్రాన్ని గిఫ్ట్గా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. 31 ఏళ్ల అంబా ప్రసాద్ .. బార్కాగావ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానం నుంచి 2009లో ఆమె తండ్రి యోగేంద్ర ప్రసాద్ సావో గెలుపొందారు. అయితే మావోలతో లింకులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన ఆ స్థానానికి రిజైన్ చేశారు. ఆ తర్వాత 2014లో అదే స్థానంలో అంబా ప్రసాద్ తల్లి నిర్మలా దేవి పోటీ చేసి గెలిచారు.