మిషన్ భగీరథపై కేంద్రం రెండు నాల్కల ధోరణికి తెగబడింది. జల్జీవన్ ముసుగు కప్పే పన్నాగానికి తెరతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇం టింటికీ నల్లాల నీరు సరఫరా చేస్తున్నందుకు అవార్డు ఇస్తున్నామంటూ హడావిడి చేస్తూనే భగీరథ పేరును ఉచ్చరించడానికి వెనుకాడుతున్నది. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు జల్జీవన్ మిషన్ పేరుతో దొంగాటకం మొదలుపెట్టింది. పైసా ఇవ్వని పథకాన్ని అప్పణంగా ఎగరేసుకుపోవాలని చూస్తున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్టుం ది కేంద్రం ధోరణి. మన మహత్తర పథకాన్ని, ఆ పథకం సాధించిన ఘనవిజయాన్ని ఎగరేసుకుపోయేందుకు చిల్లర ఎత్తులకు దిగింది. జ లం అంటే ఏమిటి? నీళ్లు అంటే ఏమిటి? రెండూ ఒకటే అని మనం అనుకుంటాం. కానీ కేంద్రం వేరువేరు అన్నరీతిలో సన్నాయినొక్కు లు నొక్కుతున్నది. తెలంగాణ గ్రామీణ ప్రాం తాల్లో ప్రతి ఇంటికీ జల్జీవన్ మిషన్ కింద నల్లా నీళ్లు క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నందుకు తెలంగాణకు అవార్డు ఇస్తున్నట్టు ఆ మిషన్ డైరెక్టర్ వికాస్ షీల్ పేరిట రాష్ట్ర సీఎస్కు ఓ లేఖ అందింది.
స్వచ్ఛ్ భారత్ దివస్లో భాగంగా అక్టోబర్ 2న గ్రామీణ నీటి సరఫరా అంశంలో విజయాలు సాధించిన ఆరుష్ర్టాలకు ఇచ్చే అవార్డు ఈ సారి తెలంగాణకు ఇస్తున్నామని అందులో ఉంది. పరిమాణం, నాణ్యత, నిరంతరాయత అనే కొలమానాల ఆధారంగా తృతీ య పక్షం ద్వారా జరిపించిన సర్వేలో తెలంగాణ ఎంపికైనట్టు ఆ లేఖలో వికాస్ షీల్ పేర్కొన్నారు. అవార్డు స్వీకరించడానికి సంబంధింత అధికారులను ఢిల్లీకి పంపాలని తెలిపారు. గ్రామాల్లో 60 శాతంపైగా ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాం తాల్లో తెలంగాణ ముందున్నదని ఆ లేఖలో ఒకటికి రెండుసార్లు అభినందించారు కూడా. ఈ లేఖనూ జాగ్రత్తగా గమనిస్తే కేంద్రం మో సం బయటపడుతుంది.
మిషన్ భగీరథ ప్రస్తావన లేకుం డా.. మిషన్ భగీరథ పథకానికి.. జల్జీవన్ మిషన్ కింద అవార్డు ఇస్తున్నట్టు చెప్పడంలోనే తిరకాసు ఉంది. అసలు మిషన్ భగీరథ ముందా? జల్జీవన్ మిషన్ ముం దా? అంటే మిషన్ భగీరథ అనే సమాధానమే వస్తుంది. సీఎం కేసీఆర్ గ్రామాల్లోని మహిళలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేస్తూ మిషన్ భగీరథ తెచ్చింది 2016లో. జల్జీవన్ మిషన్ భగీరథకు కాపీగా వచ్చింది 2019లో. అసలు తెలంగాణలో జల్జీవన్ మిషన్ అనేదే లేదు. ఉన్నది భగీరథ ఒక్కటే. వికాస్ షీల్ అవార్డు గురించి లేఖ రాసింది సెప్టెంబర్ 26న. ‘నల్లాల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నందుకు’ అని వికాస్ షీల్ తన లేఖలో స్పష్టంగా చెప్పారు. ఇది మాటల గారడీ చేసి మసిబూసి మారేడు కాయ చేసే ధోరణి తప్ప మరోటి కాదు.
తాజాగా మీడియాకు జల్శక్తి మంత్రిత్వ శాఖ ఊరూపేరూ లేకుండా ఓ లీక్ ఇచ్చింది. అవార్డు ఇచ్చింది మిషన్ భగీరథకు కాదని, జల్జీవన్ మిషన్కు మాత్రమేనని, తెలంగాణ మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని చెప్పుకొంటున్నదని ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ తరహాలో విషప్రచారానికి తెగబడింది. తెలంగాణలో ఇంటింటికీ అందుతున్న భగీరథ నల్లాల నీటి సాక్షిగా ఇది పచ్చిమోసం. నిఖార్సయిన అబద్ధం. ఉన్న పథకాన్ని ప్రస్తావించకుండా లేని పథకం కింద అవార్డు ఇస్తున్నామని బుకాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో కీలకం కూడా ఉంది. దేశానికే ఆదర్శంగా నిలిచి పురస్కారానికి ఎంపికైన మిషన్ భగీరథకు నిధులు సమకూర్చాలని తెలంగాణ అడిగితే కేంద్రం పైసా ఇవ్వలేదు.