హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో మిస్ ఎర్త్ ఇండియా-2019 తేజస్విని మనోజ్ఞ పాల్గొన్నది. సోమవారం జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మొక్కలు నాటింది. అనంతరం మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటడం, ఒక మొక్కకు ప్రాణంపోయడం ఆనందంగా ఉందని చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన ఈ యజ్ఞం భావితరాలకు, సకల జీవులకు లాభదాయకమన్నారు. గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీనివాస్ శర్మ, ఐఏఎస్ గిరిజాశంకర్, ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్ స్కెప్ ఎండీ నాగరాజుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ను విసిరి, మొక్కలు నాటాలని కోరింది.