నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దాడిని అడ్డుకోవడానికి యత్నించగా అతడిపైనా దాడి చేశారు. దుండగుల దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.