భోపాల్ : మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చి బాబాను భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు సంతానం కలగకపోవడంతో స్వామీజీగా చెప్పుకునే మిర్చి బాబాను కలిశానని ఆపై ఆయన మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని మిర్చి బాబా హెచ్చరించాడని తెలిపారు. బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్లో ఆగస్ట్ 8న ఫిర్యాదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. సోమవారం రాత్రి గ్వాలియర్లో మిర్చి బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని భోపాల్ తరలించి అక్కడే ప్రశ్నిస్తున్నారు.