రాంచీ : కొంత మంది యువకులు క్రూర మృగల్లా ప్రవర్తించారు. ఓ మైనర్పై బాలికపై కామంతో విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
దమ్కా జిల్లాకు చెందిన ఓ తల్లీకూతురు.. ఓ వేడుక నిమిత్తం దియోఘర్కు ఆదివారం వెళ్లారు. వేడుక ముగిసిన అనంతరం వారిద్దరూ మళ్లీ దమ్కా జిల్లాలోని తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. అయితే మదుపూర్ ఏరియాలో తల్లీబిడ్డలను ఓ ఐదుగురు యువకులు అడ్డగించారు. తల్లి ముందే ఆ బిడ్డపై కామాంధులు విరుచుకుపడ్డారు. తన కూతుర్ని ఏం చేయొద్దంటూ అడ్డుకోబోయిన తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.
దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.