జైపూర్ : రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్వుకాలు జరుపుతున్న సమయంలో మట్టి దిబ్బ కూలిపోవడంతో మైనర్తో సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహాయక చర్యల కోసం విపత్తు ప్రతిస్పందన దళం ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ టీమ్ క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. జలోర్ డిప్యూటీ ఎస్పీ హిమ్మత్ చరణ్ మాట్లాడుతూ జలోర్లోని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్వతున్న సమయంలో మట్టి దిబ్బ కూలిపోయిందని తెలిపారు. చిన్నారితో ఐదుగురు మృతి చెందారని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.