హైదరాబాద్ : మల్కాజ్గిరి జిల్లా హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న మెడికల్ క్యాంప్ను మంత్రులు శ్రీనివాస్గౌడ్, చామకూర మల్లారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, మెడికల్ కిట్లను అందించారు. అనంతరం క్రీడాకారులతో మాట్లాడి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తాను చాటి, పతకాలు సాధించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్లకు పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తయారు చేస్తున్నామన్నారు. మంత్రులు క్రీడా పాఠశాల పర్యటనలో భాగంగా ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తున్న జిమ్నాస్టిక్స్ను పరిశీలించారు.
అనంతరం ఆర్చరీ, ఫుట్బాల్ క్రీడాకారులతో మాట్లాడారు. స్పోర్ట్స్ స్కూల్లో పరిస్థితులపై ఆరా తీశారు. పాఠశాలను రూ.13కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పాఠశాల పచ్చదనాన్ని పెంపొందించాలని స్కూల్ ఓఎస్డీ హరికృష్ణను ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్ రావు, జూపల్లి భాస్కరరావు, సాట్స్ అధికారులు సుజాత, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.