మొయినాబాద్, ఆగస్టు 18: పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సమన్వయం తో ముందుకు రావాల్సిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు రెవె న్యూ పరిధిలోని మృగవని ఫారెస్టు ప్రాంతం లో గురువారం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సీడ్బాల్స్ కార్యక్రమం నిర్వహించారు.
మంత్రులతోపాటు ఎంపీ సంతోష్, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, పాల్గొని అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ విసిరారు. విద్యార్థులు, ఎన్జీవోల తో కలిసి తయారుచేసిన సీడ్బాల్స్ను అథి తులు పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులతో కలిసి విసిరారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం ఏడేండ్ల క్రితం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగం గా కోట్లాది మొక్కలు నాటినట్టు చెప్పారు.
నాటిన మొక్కలు నేడు మహా వృక్షాలుగా పెరిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం.. భావితరాలకు హరిత కానుక అవుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, డీఎఫ్వోలు తదితరులు పాల్గొన్నారు.