అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదివరకున్న మంత్రివర్గంలో పనిచేసిన కన్నబాబు, అనిల్కుమార్ స్థానంలో ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమశ్ను బీఏసీ సభ్యులుగా నియమించారు. బీఏసీలో లేజిస్లేటివ్ అఫైర్ కో ఆర్డినేటర్గా గండికోట శ్రీకాంత్రెడ్డిని నియమించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశంలో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను ఈనెల 12వ తేదీలోగా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలంటూ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి కెఎస్. జవహర్రెడ్డి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించనున్నారు. చివరిసారిగా జులై 19 నుంచి ఐదురోజుల పాటు సమావేశాలు జరిగాయి.