ములుగు: మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ నేడు మేడారంలో (Medaram) పర్యటించనున్నారు. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. జాతర ఏర్పాటపై అధికారులతో సమీక్షించనున్నారు. మంత్రులతోపాటు సీఎం సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా మేడారం వెళ్లనున్నారు.
నేడు మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. మంత్రుల పర్యటన సందర్శంగా ఏజెన్సీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.