హైదరాబాద్ : గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మి మరణం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి ఫోన్ చేశారు. ఆమె తో మాట్లాడి వారి తల్లి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెను ఓదార్చి, మనోధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. దస్మి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.