పర్యావరణాన్ని పరిరక్షించాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం
తెలంగాణలో అధిక వర్షపాతం నమోదుతో రాష్ట్రం సుభిక్షం
మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్
పాల్గొన్న నటుడు రాజేంద్రప్రసాద్
మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టులో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి , ఎంపీ సంతోష్కుమార్, నటుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విరివిగా మొక్కలు పెంచి భావితరాలకు ఆరోగ్యాన్ని పంచుదామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు.
మొయినాబాద్, ఆగస్టు 18 : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారం చుట్టిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టుకు సంబంధించిన అటవీ ప్రాంతంలో గురువారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సీడ్ బాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు ఎంపీ, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సీడ్ బాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు సీడ్ బాల్స్ను విసిరారు. డ్రోన్ కెమెరాతో ఫారెస్టు ప్రాంతంలో సీడ్ బాల్స్ను వేయించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్టంలో పచ్చదనాన్ని పెంచి భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. కొండలు, దట్టమైన అటవీప్రాంతాల్లో, మను షుల సంచారం లేనిచోట సీడ్ బాల్స్ను విసిరి మొక్కలను పెంచడానికి అవకాశం ఉంటుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే భావితరాల వారికి మంచి ఆరోగ్యాన్ని అందించినవారవుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తమ పరిసరాలను మంచి పర్యావరణ ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కోట్ల మొక్కలను నాటడం అభినందనీయమన్నారు.
మానవుని అవసరాల నిమిత్తం అటవీ ప్రాంతం తగ్గుతున్న నేపథ్యంలో పరావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. దీంతో మానవ జీవ కోటికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదవుతున్నదని తెలిపారు.
కార్యక్రమంలో నటుడు రాజేంద్రప్రసాద్, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, సర్పంచ్ స్వరూప, ఎంపీడీవో సంధ్య, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, రవూఫ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీలు అర్జున్, సుజాత, మల్లేశ్, నాయకులు మాణిక్రెడ్డి, వెంకట్రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్, కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, పరమేశ్, సుధాకర్రెడ్డి, రాంచందర్, అధికారులున్నారు.