హైదరాబాద్ : న్యాక్ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాక్లో అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై ఆరా తీశారు. న్యాక్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించిన మంత్రి..ఉద్యోగుల సమస్యలపై వారితో చర్చించి సామరస్యంగా పరిష్కరించాలని ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాస రాజును ఆదేశించారు. సమావేశంలో న్యాక్ డి.జి. భిక్షపతి, పీఎస్ ముకుంద్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.