వేల్పూర్ : పెన్షన్ మంజూరు చేయాలని వచ్చిన దివ్యాంగుడి బాధను తెలుసుకుని చలించిన రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన నర్సయ్యకు రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఒక కాలును వైద్యులు తొలగించారు. దీంతో అతను ఏ పని చేసుకొలేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. . పెన్షన్ కోసం మండల అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక పోవటంతో సోమవారం తన నివాసం వేల్పూర్కు వచ్చిన మంత్రికి తన బాధితుడు తన బాధను వినిపించుకున్నాడు.
దీంతో చలించి పోయిన మంత్రి సంబంధిత అధికారులతో ఫొన్లో మాట్లాడి పెన్షన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. సికింద్రాపూర్ నుంచి ఎలా వచ్చావు అని మంత్రి బాధితుడని అడుగగా ఆటోలో వచ్చాను.. చెప్పటంతో మంత్రి తన కారులో ఇంటి వరకు దింపిరావాలని అక్కడే ఉన్న ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములుకు ఆదేశించడంతో బాధితుడిని ఇంటివద్ద వదిలి వచ్చారు. దీంతో బాధితుడు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు.