నిజామాబాద్ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. వనమహోత్సవంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలోని పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్ పార్క్లో మొక్కలు నాటారు.
దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఫ్రీడమ్ పార్క్’ లో ఏక కాలంలో 750 మొక్కలు నాటారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సదర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మంత్రి సూచించారు. దేశం గర్వించేలా వజ్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు.