హైదరాబాద్ : శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్థీవ దేహానికి శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. బోడకుంటి వెంకటేశ్వర్లు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, వి.జి గౌడ్, టీఆర్ఎస్ ఎల్పీ ఇంచార్జి రమేష్ రెడ్డి ఉన్నారు.